హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.348.94 కోట్ల సొత్తును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీల్లో నిత్యం మద్యం, నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడుతున్నాయి.
ఈ మేరకు గురువారం రూ.8,83,24,147 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.122.62 కోట్ల నగదు, రూ.20.70 కోట్ల విలువైన మద్యం, రూ.17.18 కోట్ల మాదకద్రవ్యాలు, రూ.156.22 కోట్ల విలువైన బంగా రు, వెండి, వజ్రాలు, ఇతర ఆభరణాలు, రూ.30.42 కోట్ల విలువైన బహుమతులను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలున్నవాటిని తిరిగి ఇచ్చేస్తున్నారు.