హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): సర్కార్ బడుల్లోని విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పాఠాల బోధనకు విద్యాశాఖ వినూత్న కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది. అన్నా – అక్క మెంటార్షిప్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు ఇంటర్న్లుగా 6-10వ తరగతి వరకు గల విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు.
జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమం దశలవారీగా ఉంటుంది. ఇంటర్న్ చేసే విద్యార్థి 30 గంటల ఇంటర్న్షి ప్ చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేథస్సు, కోడింగ్, డాటాసైన్స్, గేమ్ డిజైన్, డిజిటల్ నైపుణ్యాలపై పాఠాలు బోధిస్తారు.