హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వైద్యులకు ఏరియర్స్ విడుదల చేయడంతోపాటు ప్రొఫెసర్ల బదిలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం టీచింగ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సంబురాలు నిర్వహించారు. ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెం ట్లు, వైద్యులు కేక్ కట్ చేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వైద్యుల పెండింగ్ సమస్యలు పరిష్కరించడం ద్వారా సీఎం కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట ర్ అన్వర్ తెలిపారు. ఉత్తర్వులను స్వయంగా అందజేసిన మంత్రి హరీశ్రావుకు, సహకరించిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సెక్రటరీ జనరల్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు కిరణ్ మాదాల, కోశాధికారి కిరణ్ ప్రకాశ్ చెప్పారు.