వాజేడు, మార్చి12: ములుగు జిల్లా వాజేడు మండలంలో ‘గుమ్మడిదొడ్డికి ఏమైంది’? శీర్షికన ఈ నెల 10న ‘నమస్తే తెలంగాణ’లో వార్త కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య స్పందించారు. మంగళవారం గ్రామపంచాయతీలోని గుమ్మడిదొడ్డి, ఇప్పగూడెం, సుందరయ్యకాలనీ గ్రామాల్లో వైద్యసిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు.
జ్వరాలు, మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారిని గుర్తించారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారిని పరీక్షించారు. అనంతరం డీఎంహెచ్వో మీడియా సమావేశంలో మాట్లాడారు. గుమ్మడిదొడ్డి గ్రామంలో జ్వరాలు, మోకాళ్ల నొప్పులతో బాధపడే 70 మందికి పరీక్షలు చేసి ల్యాబ్కు పంపించామని తెలిపారు. నీటి పరీక్షలు కూడా చేశామని, చాలా మందికి వైరల్ ఆర్థోరైటిస్తోనే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని గుర్తించినట్టు చెప్పారు.