హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్లో జరిగిన అక్రమాలు, అవినీతిని న్యాయ విచారణ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే నారాయణ, సయ్యద్ అజీజ్పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, పశ్యపద్మ, టీ శ్రీనివాసరావు తదితరులతో కూడిన బృందం మంగళవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి, జెన్కో, ట్రాన్స్కో సంస్థలకు సమర్థులైన అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కల్పించుకున్న సీఎం ఇదే విషయాన్ని విద్యుత్తుశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారికి సూచించారు.