కొల్లాపూర్ : నాగర్కర్నూల్( Nagarkarnool)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్(,RTC bus) ఢీ కొట్టడంతో దంపతులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పెద్దకొత్తపల్లి మండలం వాయిలబావి గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ట్రాలీ ఆటోలో పాత ఇనుప సామాను తీసుకెళ్తుండగా ఆర్టీసీ బస్ ఆటోను ఢీ కొట్టడంతో స్పాట్లోనే భార్యా భర్తలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.