నయీంనగర్/వరంగల్ చౌరస్తా/కోటపల్లి, అక్టోబర్ 12: పిస్టల్తో అల్లుడు అత్తను చంపి న ఘటన హనుమకొండలోని కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రమాదేవి భర్త ఏ ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. భార్యతో కొ న్నేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తనను, తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం లేదని ప్రసాద్పై ఇటీవల రమాదేవి ఫిర్యాదు చేయడంతో నెలకు రూ.15వేల చొప్పున డబ్బులిస్తానని చెప్పాడు. కొన్ని రోజుల క్రితం బామ్మర్దితోనూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో ప్రసాద్ అదే పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై తుపాకీని తీసుకుని గు రువారం అత్తగారి ఇంటికి వచ్చాడు. గతంలో ఇచ్చిన రూ.4 లక్షల గురిం చి అడిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గన్తో అత్తను కాల్చి చంపాడు. దీంతో రమాదేవి ఏడుస్తూ ‘మా అమ్మను ఎందుకు చంపావంటూ’ నెట్టేయడంతో ప్రసాద్ తల గోడకు తాకడంతో తీవ్రగాయాలై స్పృహ కోల్పోయా డు. పోలీసులు అతడిని చికిత్స నిమి త్తం ఎంజీఎం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపారు. హత్య జరిగిన స్థ్ధలాన్ని డీసీపీ బారీ, ఏసీపీ డేవిడ్రాజ్, సీఐలు అబ్బయ్య, గోపి, కరుణాకర్ క్లూస్ టీం, ఇతర సిబ్బంది పరిశీలించారు.
కానిస్టేబుల్ వాడిన తుపాకీపై రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు.. మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్స్టేషన్లో డీసీపీ సుధీర్ కేకన్ విచారణ జరిపారు. గోదావరిఖనిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రసాద్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల కోటపల్లికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ బుధవారం రాత్రి తనకు వారెంట్ కావాలని పోలీస్ అధికారిని అడిగాడు. ఆయుధాలు భద్రపరిచే గదిలో వారెంట్ బుక్ ఉండగా.. తాళం చెవి తీసుకొని గదిలోకి వెళ్లిన ప్రసాద్ వారెంట్ బుక్తోపాటు ఎస్సై రివాల్వర్ తీసుకున్నట్టు అనుమానాలున్నాయి. విచారణ నివేదికను సీపీకి పంపించనున్నట్టు డీసీపీ తెలిపారు.