హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో బీఆర్ఎస్ సభకు పోటీ గా తాము కూడా భారీ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్లో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగింది. నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన సభకు పోటీగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భారీ సభ నిర్వహించి దానికి పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీని ఆహ్వానించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ప్రతిపాదనకు పార్టీ ఆమోదం తెలిపినట్టు తెలిసింది.
ఈ సభను రెండు లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ నెల 3వ వారంలో సభ ఏర్పాటుకు సూచనప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై తగ్గొద్దని పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి సూచించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నేతల ఆరోపణలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని సూచించినట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో 13 సీట్లకు తగ్గకుండా గెలుచుకునే విధంగా కృషి చేయాలని రేవంత్రెడ్డి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది.
ప్రదేశ్ ఎన్నికల కమిటీ తిరిగి ఈ నెల 15న సమావేశం కావాలని నిర్ణయించింది. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తుల ను పీఈసీ సభ్యులకు అందజేసి, బుధవారం వరకు ఒక్కో నియోజక వర్గం నుంచి మూడు పేర్లను సూచిస్తూ అందజేయాలని సమావేశం ఆదేశించినట్టు తెలిసింది. షార్ట్ తర్వాత వారి అభ్యర్థిత్వాలపై 15నాటి సమావేశంలో చర్చిం చి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించాలని నిర్ణయించింది.
ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాసు మున్షీ, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్చౌదరి, సభ్యులు జిగ్నేశ్ మేవాని, విశ్వజిత్ కదమ్, పీఈసీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి, జీవన్రెడ్డి, రేణుకాచౌదరి, జే గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు.