హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కామర్స్ టాలెంట్ టెస్ట్కు విశేష స్పందన లభించింది. ఈ పరీక్షను సోమవారం హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఐఐఎంసీ కళాశాలలో నిర్వహించారు. ఐఐఎంసీ కళాశాల అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆండ్ అంబిషన్స్ కెరీర్ కౌన్సిలర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ టెస్ట్ జరగ్గా, ‘నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే’ మీడియా పార్ట్నర్గా వ్యవహరించాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 కాలేజీలకు చెందిన 300 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అనంతరం టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు.
మొదటి బహుమతి రూ.7వేలు జీ శివానంద్ (ఓయూ), సాయి నిఖిత (అవినాశ్ కాలేజీ), రెండో బహుమతి రూ.3 వేలు పూజ (ఓయూ), మూడో బహుమతి రూ.3 వేలు సంజన, కావ్య (ఐఐఎంసీ) గెలుచుకొన్నారు. పదిమంది విద్యార్థులకు కన్సొలేషన్ బహుమతులు అందజేశారు. వీరిలో మీర్జా అబ్దుల్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫలక్నుమా), మన్సూ అగర్వాల్ (సెయింట్ ఆన్స్), మనస్విని (ఓయూ), శ్రావణి (సెయింట్ పాయిస్), గ్రీష్మ, మాధురి, ఉష, విశాల్రాజ్, జ్యోతి, తృప్తి గాటే (ఐఐఎంసీ) ఉన్నారు. ముందుగా, కళాశాల ప్రిన్సిపాల్ రఘువీర్ మాట్లాడుతూ, డిగ్రీ, పీజీ స్థాయి కామర్స్ విద్యార్థుల్లో విషయ నిపుణతను పెంపొందించడమేగాక, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా తీర్చిదిద్దేందుకు ఇటువంటి పరీక్షలు దోహదపడుతాయని పేర్కొన్నారు.