తిరుమలగిరి, మార్చి 21: కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోమారు బయటపడింది. ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం ఏర్పడింది.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి కలిసి వడగండ్లతో పంట నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ తమకు తెలియకుండా, తమ ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలను చించేశారు.