హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టను అని ఇన్నాండ్లుగా చెప్పిన మాటలు నిజమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం పట్ల బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రప్రభుత్వం బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడిందని, అయినా కేసీఆర్ వాటికి లొంగలేదని చెప్పారు.
కేసీఆర్కు రైతులు, వారి ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంచేశారు. కాంగ్రెస్.. వ్యవసాయానికి మూడు గంటలే కరెంట్ ఇస్తామని చెప్తున్నదని, దీంతో ఆ పార్టీకి రైతులపై ఉన్న వైఖరేంటో బహిర్గతమైందని పేర్కొన్నారు. రైతాంగం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టి మరోసారి కేసీఆర్ను సీఎంగా ఎన్నుకొందామంటూ శ్రవణ్ పిలుపునిచ్చారు.