నల్లగొండ : ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కావాలనే కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో పోడు భూముల సమస్యపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు.
వానకాలం పంట ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. సన్న రకం ధాన్యం కొనుగోళ్లలో మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల ప్రాంతాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమపద్ధతిలో కొనుగోళ్లు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మిల్లర్లతో, ట్రేడర్స్ తో, లారీ యజమానులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు కొనుగోళ్లు వేగంగా చేపడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ బీజేపీ నాయకులకు కనీస బాధ్యత లేదు. రైతల విషయంలో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమన్నారు. బీజేపీ నాయకులు రైతులకు ద్రోహం చేస్తున్నారు. రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. రైతులు ఎవరు ప్రతిపక్షాలు చేస్తున్న ఉచ్చులో పడొద్దు.
వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు పరం చేసే పెద్ద కుట్ర బీజేపీ పన్నిందన్నారు. కేంద్రం తెలంగాణ పై కక్ష్యపురితంగా వ్యవహరిస్తూ అన్నం పెట్టే రైతులను అవస్థల పాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, ఉతమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వివిధ పార్టీల ప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Snake bite | తండ్రీ బిడ్డలను కాటేసిన పాము..చిన్నారి మృతి
రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : మంత్రి ఐకే రెడ్డి
యాదాద్రికి పోటెత్తిన భక్తులు..