కరీంనగర్ : ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యాన్ని విక్రయించడంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విఫలమైందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. గంగాధర మండలం గోపాలరావుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినోద్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందు పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు ఇచ్చేలా చూడాలన్నారు. రాష్ట్రంలో అమలౌతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 900 రూపాయలకు వడ్లు కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో మాదిరిగా మద్దతు ధరను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయమని మొండికేసినా రాష్ట్ర ప్రభుత్వంమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా భారం పడుతున్న కూడా సీఎం కేసీఆర్ రైతులు ఇబ్బందులు పడొద్దనే ధాన్యం కొంటున్నారని వినోద్ కుమార్ తెలిపారు.