BRS | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని, కేంద్రానికి ని రసన తగలాలని సూచించింది. మహిళా సంఘాలు, సంస్థలు, మహిళలు పెద్దఎత్తున హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించింది.
కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసిందని పార్టీ ఆరోపిస్తున్నది. లిక్కర్ కేసుకు కవితకు సంబంధం లేకపోయినా బీఆర్ఎస్, కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో కవితను అరెస్ట్ చేశారని విమర్శిస్తున్నది.