CM KCR | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 27, (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కంధార్ లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఉహించని విధంగా బీఆర్ఎస్ సభకు మరాఠ్వాడ ప్రజలు నీరాజనం పలికారు. దీంతో ఈ సభకు జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యం కల్పించి పతాకశీర్షికలతో, మొదటి పేజీ ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించాయి. ప్రముఖ ఆంగ్ల, హిందీ జాతీయ పత్రికలతో పాటు ప్రాంతీయ భాషా పత్రికలు, ప్రముఖ న్యూస్ వెబ్సైట్లు, న్యూస్ చానెల్స్ బీఆర్ఎస్ సభా విశేషాలను ప్రముఖంగా కవర్ చేశాయి. జాతీయ పత్రికలు ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూర్, హైదరాబాద్ నగరాల ఎడిషన్లలోనూ ఈ సభపై కథనాలను ప్రచురించడం విశేషం.
జాతీయ మీడియా, వాటి శీర్షికలు…