రంగారెడ్డి : జిల్లాలోని కొత్తూరు మండలం ఇన్నుల్ నర్వ గ్రామ శివారులో మూడు రోజుల క్రితం క్వారీ గుంతలో పడి గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. కాగా, ఘటన స్థలానికి ఎన్డీఅర్ఎఫ్ బృందాలు చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. క్వారీ నుంచి బోరు మోటర్ల ద్వారా నీటిని బయటికి పంపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చందు(16 ) అనే బాలుడు మేకలు కాస్తూ ప్రమాద వశాత్తు కాలుజారి క్వారీ గుంటలో పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రానైట్స్ కోసం లోతుగా తవ్వకాలు జరిపి వాటిని పూడ్చకపోవడంతోనే బాలుడు మృతి చెందాడని కుబుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.