హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తో పొత్తుపెట్టుకుని బీజేపీ తెలంగాణపై విషం చిమ్మడాన్ని ప్రజలెవ్వరూ సహించరని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించే విధానాలకు బీజేపీ పాల్పడుతుందని విమర్శించారు.
తెలంగాణ మీద విషం చిమ్ముతున్న పవన్ కళ్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకున్నది
తెలంగాణ కండ్లు పడి ఆంధ్రా కొబ్బరి చెట్లు ఎండిపోయాయన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు – మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/wPIJ3EPCzQ
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2026
ఒక వైపు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరారు. మరోవైపు తెలంగాణ కండ్లు పడి ఆంధ్రా కొబ్బరి చెట్లు ఎండిపోయాయన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా, వివక్షపూరితంగా మాట్లాడే వ్యక్తులతో పొత్తులు పెట్టుకుని వస్తున్న బీజేపీ ఆలోచనను తెలంగాణ మేధావులు,ప్రజలు ఆలోచించాలని కోరారు.