కష్టకాలంలోనూ ప్రజలను ఆదుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
ఉద్యమకారుడు కేశవరెడ్డిని గుర్తుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
చెక్కుల పంపిణీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
వేంసూరు, ఏప్రిల్ 19: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించి పేదలను ఆదుకున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర సోమవారం పంపిణీ చేశారు. తొలుత కందుకూరు సొసైటీ పరిధిలో వెంకటాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఉద్యమకారుడు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పనిచేసిన గండ్ర కేశవరెడ్డికి మంజూరైన రూ.4.5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన ఇంటికి వెళ్లి అందజేశారు. ఇటీవల ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను తాను కలిసినప్పుడు కేశవరెడ్డి గురించి అడిగారని గుర్తుచేశారు. నాడు ఉద్యమంలో భాగంగా వేంసూరు మండలంలో లిఫ్టు ఇరిగేషన్లు చూసే క్రమంలో గండ్ర కేశవరెడ్డిని కలుసుకుని ఆయనతో మాట్లాడి వారి ఇంట్లోనే భోజనం చేశానని ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో చెప్పారని అన్నారు. కేశవరెడ్డి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారని చెప్పారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కందుకూరు సర్పంచ్ బూరుగు నాగేశ్వరరావును పరామర్శించి ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ సంజీవరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెల్ది జగన్మోహన్రావు, సర్పంచ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలా వెంకటరెడ్డి, ఎంపీటీసీలు నున్నా రాంబాబు, గొర్ల శ్రీనివాసరెడ్డి, లక్ష్మి, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
విపణిలోకి నెక్స్జూ ఎలక్ట్రిక్ సైకిల్.. 100 కి.మీ కెపాసిటీ!
ఆ ఐదు నగరాల్లో లాక్డౌన్ లేదు..