న్యూఢిల్లీ: ప్రముఖ స్టార్టప్ సంస్థ నెక్స్జూ మొబిలిటీ విపణిలోకి న్యూ సూపర్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ సైకిల్ను ఆవిష్కరించింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కి.మీ. వరకూ ప్రయాణం చేయొచ్చు. రోడ్లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ అని దీనికి పేరు పెట్టింది.
నెక్స్జూ స్టార్టప్ ఇంజినీర్లు డిజైన్ చేసి తయారు చేసిందే ఈ రోడ్ లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్. దీన్ని లెయిట్ వెయిట్ స్టీల్ ఫ్రేమ్తో తయారు చేశారు. అధిక సామర్థ్యం గల పవర్ ట్రైన్ను దీనికి అనుసంధానించారు. అంతే కాదు డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ కూడా జత చేశారు.
డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్లో 8.7 ఏహెచ్ లైట్ వెయిట్ రిమూవల్ బ్యాటరీ, సెకండరీ 5.2 ఏహెచ్ ఇన్-ఫ్రేమ్ బ్యాటరీ ఉన్నాయి. డొమెస్టిక్ సాకెట్తో వీటిని చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీలు చార్జింగ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది.
పెడల్ మోడ్లో న్యూ రోడ్లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్పై 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. థ్రొట్టిల్ మోడ్లో 75 కి.మీ వరకు వెళ్లొచ్చు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం దీని సొంతం. డ్యుయల్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్లు, ఫ్రంట్ సస్పెన్షన్ బ్రేక్ ఉన్నాయి.
కంఫర్టబుల్ రైడింగ్ కోసం పొడవైన సీటు ఏర్పాటు చేశారు. ఫుల్ ఫెండర్స్, మల్టీపుల్ రిఫ్లెక్టర్లతోనూ ఈ సైకిల్ అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనికి గేర్ సిస్టమ్ మాత్రం లేదు.
ఈ సైకిల్ ధర రూ.42 వేలు మాత్రమే. ఆసక్తి గల కస్టమర్లు నేరుగా నెక్స్ జూకు చెందిన 90కి పైగా టచ్ పాయింట్ల వద్ద గానీ, నెక్స్జూ మొబిలిటీ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా గానీ కొనుగోలు చేయొచ్చు.
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను
కరోనా నివారణకు 8 మార్గాలు
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
డోంట్ కేర్ కరోనా.. బంగారం దిగుమతి పైపైకి
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!
ప్రాపర్టీ పేరుతో రూ 1.2 కోట్లకు టోకరా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..