రవీంద్రభారతి, మే 27: బీసీ మంత్రి వాకిటి శ్రీహరిని అవమానించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్ తదితరులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మంత్రి శ్రీహరిపై సహచర మంత్రి అయిన పొంగులేటి పేపర్లు విసిరి అవమానించేలా దుర్బాషలాడారని ఆరోపించారు.
శ్రీహరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తా వద్ద బుధవారం మంత్రి పొంగులేటి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నీల వెంకటేశ్ మాట్లాడారు. క్షమాపణ చెప్పకుంటే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇంటిని ముట్టడించి బీసీల ద్రోహిగా ప్రకటిస్తామని హెచ్చరించారు. బీసీ మంత్రిని అవమానించడం సరికాదని, బీసీ మంత్రుల జోలికొస్తే బీసీలు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.