హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష సోమవారం సజావుగా నిర్వహించారు. ఉదయం పేపర్-1 పరీక్షకు 11,102 మంది రాగా, మధ్యాహ్నం పేపర్2కు 11,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం అభ్యర్థి రెండు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. కానీ, పేపర్-1 పరీక్ష రాసిన వారిలో 74 మంది అభ్యర్థులు పేపర్-2కు హాజరు కాలేదు. వీరు ఆటోమెటిక్గా రిమూవ్ అయినట్టే. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 163 ఉద్యోగాలను భర్తీ చేసే ఈ పరీక్షకు మొత్తం 21,472 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
కాగా, మంగళవారం రాష్ట్రంలోని 194 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్ష జరుగనున్నది. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్ష ద్వారా అగ్రికల్చర్లో 100 పోస్టులను, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో 97 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.