హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.544.27 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకు రూ.6.04 కోట్ల విలువైన మద్యం, డబ్బులు, బంగారు ఆభరణాలు, డ్రగ్స్, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు రూ.186.82 కోట్ల నగదు, రూ.77.84 కోట్ల విలువైన మద్యం, రూ.31.99 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ.178.61 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.68.99 కోట్ల విలువైన ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.3.55 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు.