హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమ స్తే తెలంగాణ): ప్రధాని మోదీ రాక సందర్భం గా హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. శనివారం ప్రధాని సభ జరిగే పరేడ్గ్రౌండ్ చు ట్టూ, నగరంలోని ముఖ్య కూడళ్లలో వెలిసిన వాటిని శుక్రవారం నుంచే ప్రజలు ఆసక్తిగా తి లకించసాగారు. మోదీజీ జర ఇధర్ దేఖోనా.. అవినీతిలో బీజేపీ టాప్.. ఇదిగో దేశంలో మీ నేతల అవినీతి బాగోతం.. అంటూ భారత్ మ్యాప్లో రాష్ర్టాల వారీగా అవినీతి వివరాలు తెలుపుతూ మోదీకి కౌంటర్గా ఫ్లెక్సీలు ఏర్పా టు చేశారు. టివోలి సమీపంలో బీజేపీ వారసత్వ రాజకీయాలపై భారీ హోర్డింగ్ను ఏర్పా టు చేశారు.
కూకట్పల్లిలో సేవ్ సింగరేణి అం టూ.. సింగరేణి బొగ్గు ప్రైవేటీకరణపై వ్యంగ్యాస్ర్తాలతో వెలిసిన వాల్ పోస్టర్లు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. బీజేపీ హటావో-సింగరేణి బచావో, సింగరేణి సంస్థపై బీజేపీ కక్ష.. సంస్థ మనుగడకు కేసీఆర్ రక్ష.. మోదీ సర్కార్ సింగరేణికి వెన్నుపోటు.. అంటూ వెలిసిన పోస్టర్లను అటుగా వెళ్లే వారంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ యత్నాలను ఆపాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం మాత్రం కుట్రపూరితంగా ప్రైవేటీకరించాలనే యత్నం చేస్తున్నదని దానిలో వివరించారు.