హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో సుమారు రూ.2.20 కోట్ల అక్రమాలు జరిగాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖలో మాయమైన ఫైళ్లు, కంప్యూటర్ల గురించి కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తున్నది.