10th Class Exams | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తాయి. పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు శనివారం విడుదల చేశారు. ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను 6 పేపర్లకే నిర్వహించనుండగా, పరీక్షలు మాత్రం ఏడు రోజుల పాటు కొనసాగుతాయి. కీలకమైన సైన్స్ పేపర్లకు రెండు రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తారు.
ఒకరోజు భౌతికశాస్త్రం, మరోరోజు జీవశాస్త్రం పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. శనివారం విద్యాశాఖపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా, ఆ శాఖ అధికారుల పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను సీఎం ముం దుంచారు. ఈ సందర్భంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రూపొందించిన షెడ్యూల్ను సీఎం ఆమోదించగా, పరీక్షల విభాగం అధికారులు షెడ్యూల్ను విడుదల చేశారు.