హైదరాడాద్ : అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 89,039 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం హర్షనీయం. ఈ ప్రకటన తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11,039 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ చేయడం, 89,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల తెలంగాణ యువతకు ఎంతో మేలు చేస్తుందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇప్పుడు మరో 92 వేల పోస్టుల భర్తీ అవుతున్నాయన్నారు. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు తెలంగాణ యువత, విద్యార్థుల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.