హైదరాబాద్ : రైతుబంధు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అనుకరిస్తున్నాయి. ఇది సీఎం కేసీఆర్కు దక్కిన అరుదైన గౌరవం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడమే రైతుబంధు పథకం లక్ష్యమని, రైతుకు పెట్టుబడే రైతుబంధు అని, ఈ వినూత్న పథకం ప్రపంచానికి ఆదర్శమని ఆయన తెలిపారు.పెట్టుబడి సాయం చేస్తున్న మహా నేత సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రైతు బంధు ద్వారా రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం గొప్ప విషయం అని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్న రైతు బంధు కార్యక్రమానికి మేధావులు, అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు.
రైతుకు పెట్టుబడి సాయం అందడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, రైతులలో ఆర్థిక ధీమా పెరిగిందని వినోద్కుమార్ తెలిపారు.రైతబంధుకు తోడుగా పుష్కలంగా సాగునీరు అందడం, 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండటంతో పంట ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని వినోద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
రైతుబంధు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అనుకరిస్తున్నాయని , ఇది సీఎం కేసీఆర్ కు దక్కిన అరుదైన గౌరవం అని ఆయన వివరించారు.
రైతు బంధుతోపాటు రైతుబీమా వల్ల రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమాతో 70 వేల మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యం అని, రైతులు సంతోషంగా ఉండటమే ఏకైక అజెండా సీఎం కేసీఆర్ ది అని వినోద్ కుమార్ తెలిపారు.