హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఇంటర్ పరీక్షలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన తరగతులను ఈ నెల 9 నుంచి టీ సాట్లో ప్రసారం చేయనున్నట్టు టీ సాట్ సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి ప్రకటించారు. మార్చి 15న ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని పాఠ్యాంశాల ప్రసారంపై నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. టీసాట్ నిపుణ చానల్లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలుంటాయని వెల్లడించారు.
పనిదినాల్లో మాత్రమే మార్చి 10 వరకు ఈ ప్రసారాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పరీక్షలను ఎలా ఎదురోవాలి? పరీక్ష సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే వాటిపై సబ్జెక్టుల వారీగా అధ్యాపకులు అవగాహన కల్పిస్తారని వివరించారు.