హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పట్టణ పేదరిక నిర్ములన సంస్థలోని రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)ల వేతనాలు పెంపు ఉత్తర్వులను మంగళవారం విడుదల చేయడం పట్ల రాష్ట్ర మెప్మా ఆర్పీల సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకొన్న సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.