హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను వి నియోగించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించిందని ఆ సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీకి చెందిన సుమారు 240 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు రెండు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించినట్టు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.రెట్రో ఫిట్మెంట్ కోసం నిరుడు సెప్టెంబర్ 15న టెండర్లు పిలిచి సాయిగ్రీన్ మొబిలిటీ సంస్థకు 200, కల్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్కు 40 బస్సులను అప్పగించినట్టు తెలిపారు.