హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల సౌకర్యా ర్థం బెంగళూరు-హైదరాబాద్ రూట్ల లో కొత్త స్టాప్లు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ యాజమాన్యం బుధవారం ప్రకటించింది.బెంగళూరులో పీని యా, యశ్వంతపూర్ మెట్రో స్టేషన్, కెంపెగౌడ బస్స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్, ఎస్టీమ్ మాల్, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్ వంటి చోట్లలో బోర్డింగ్ అండ్ అలైటింగ్ పాయింట్ల ఉన్నాయని తెలిపింది.
చందాపూర్ రూట్లో చందాపూర్, బొమ్మసంద్ర, ఎలక్ట్రానిక్ సిటీ, బొమ్మనహళ్లి మె ట్రో స్టేషన్, మార్తహళ్లి రూట్లో వ ర్తూర్ జంక్షన్, మార్తహళ్లి, దొమ్లూరు బ్రిడ్జి వంటి చోట్ల కొత్త స్టాప్లు ఏర్పాటు చేసినట్టు పే ర్కొంది. హైదరాబాద్లో పటాన్చెరు నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీల్లో స్టాప్లు ఉన్నాయని వెల్లడించింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు స్టాప్ లు.. హయత్నగర్ నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ప్రధాన స్టేజీల్లో బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు ఉన్నట్టు వివరించింది.