హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ర్టాభివృద్ధికి తోడ్పడుతామని టీజీవో నేతలు ప్రకటించారు. ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని టీజీవో నేతలు కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధానకార్యదర్శి ఏ సత్యనారాయణ, రవీందర్కుమార్, ఎస్ సహదేవ్, గండూరి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణాయాదవ్, బీ వెంకటయ్య, కృష్ణమూర్తి, సుజాత, సబిత, నిరంజన్రెడ్డి, యాదగిరి, ఉమాకాంత్ తదితరులు ఉన్నారు.