హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జీ చంద్రశేఖర్రెడ్డి సోమవారం లోక్భవన్లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధి, విద్యాసంస్థల బలోపేతం, అకాడమిక్ సంసరణలకు సంబంధించిన అంశాలను గవర్నర్కు వివరించారు.
సమాచార హకు చట్టం అమలు, పారదర్శకత, సమాచార కమిషన్ కార్యకలాపాలపై గవర్నర్తో చర్చించారు. అనంతరం గవర్నర్ వారికి ప్రజలకు సమర్థవంత సేవలందించడంలో సంస్థాగత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.