భూపాలపల్లి: సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు ఉధృతం చేస్తున్నది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించిన కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్లే కార్డులు ప్రదర్శించారు. నిరాహార దీక్షలో సింగరేణి కార్మికులతోపాటు టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, టీబీజీకేఎస్ నేతలు పాల్గొన్నారు.