హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలను ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్డీ డైరెక్టర్ జీ రమేశ్ తెలిపారు. ఈ నెల 22 వరకు జరుగనున్న పరీక్షల పూర్తి షెడ్యూల్ను విడుదల చేశారు.
పేపర్లవారీగా షెడ్యూల్ ప్రకటించారు. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షలను రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామని తెలిపారు.