హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-25 ప్రవేశ పరీక్ష మంగళవారం జరగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఓఎమ్మార్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తారు.
276 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,06,716 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.