హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరగాల్సిన టెట్ పరీక్షలను వాయిదావేయాలని టెట్ అభ్యర్థులు, ఓటర్లు శనివారం ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు.
పరీక్షలు నిర్వహిస్తే 70వేల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదమున్నదని ఆయా లేఖల్లో ప్రస్తావించారు. టెట్ను వాయిదావేయాలని అభ్యర్థి రావుల రామ్మోహన్రెడ్డి ఈసీని కోరారు.