హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో (Assembly Session) ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ, రేవంత్ రెడ్డి ఫొటోతో కూడిన టీ షార్ట్స్ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
అదానీ, రేవంత్ దోస్తానాపై నిరసన తెలుపుతున్నారు. రేవంత్ అదానీ భాయి భాయి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. అంతకుముందు గన్పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులకు జోహార్.. వీరులకు జోహార్ అంటూ పాటపాడారు.
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు https://t.co/p7fSjXKDQh pic.twitter.com/X04N3qxnyu
— Telugu Scribe (@TeluguScribe) December 9, 2024
Live: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకుంటున్న పోలీసులు
https://t.co/QI0hXhbOc0— BRS Party (@BRSparty) December 9, 2024