హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): గురుకులాలకు సంబంధించి డైట్ ప్రొవిజన్ అంటే చికెన్, మటన్, కాయగూరల కొనుగోలు, అదేవిధంగా స్వీపింగ్, శానిటేషన్, వంట నిర్వహణ ఏజెన్సీల ఎంపికను డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ(డీపీసీ) ద్వారా చేపట్టాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల అధికారులు, శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి సైప్లె ఏజెన్సీలను ఖరా రు చేయాలని ఆదేశించింది.