GHMC | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఒక్కరోజు కురిసిన వర్షం 10 మంది కార్మికులను బలితీసుకున్నది. హైదరాబాద్లో మంగళవారం వర్షం కురుస్తుందన్న ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనికితోడు సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం సకాలంలో స్పందించలేదన్న విమర్శలున్నాయి. బాచుపల్లిలోని రేజ్ అపార్ట్మెంట్ ప్రహరీ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు ప్రమాదం జరిగితే అర్ధరాత్రి 12 గంటలకు సహాయక చర్యలు మొ దలయ్యాయి.
ఘటనా స్థలానికి వెళ్లేందుకు సరైన దారిలేకపోవడం, విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పోలీసులే చీకట్లో దారి ఏర్పాటు చేసుకొని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, డీఆర్ఎఫ్ విభాగాల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. బేగంపేట నాలాలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందా రు. బహదూర్పురాలో మరో కార్మికుడు కరెంటు స్తంభం తాకడంతో విద్యుదాఘాతానికి గురై ప్రా ణాలు కోల్పోయాడు. బాచుపల్లి దుర్ఘటనకు నిర్మాణదారు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని రంగారెడ్డి జోన్ కార్మికశాఖ జా యింట్ కమిషనర్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 50 వేలు, అంత్యక్రియలకు రూ. 30 వేలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.