Cold Weather | మంచిర్యాల, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్ సిటీబ్యూరో : ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం చలితో వణికిపోతున్నారు. చలి ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్రంగా ఉంది.
గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 6.6, ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 7.5, నిర్మల్ జిల్లా పెంబిలో 8.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జైపూర్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా గ్రేటర్ హైదరాబాద్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 13.6 డిగ్రీలు నమోదైంది.