హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఇటీవల తెలుగులో తీర్పునిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు టీ నవీన్రావు, నగేశ్ భీమపాకలను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సన్మానించారు. హైకోర్టులోని న్యాయవాదుల కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ.. హైకోర్టులో ఇచ్చినట్టుగానే మున్సిఫ్ కోర్టు, సబ్ కోర్టు, జిల్లాస్థాయి అన్ని కోర్టుల్లో తీర్పులు తెలుగులో వెలువడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయమై న్యాయమూర్తులకు వినతిపత్రం అందజేశారు. ‘తెలుగులో తొలి తీర్పు’ అనే పుస్తకాన్ని ఆవిషరించారు. కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ కిషోర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కల్యాణ్రావు, కార్యదర్శి ప్రదీప్రెడ్డి న్యాయవాదులు వీ రామకృష్ణారెడ్డి, చికుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.