Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షల తేదీలను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఖరారు చేసింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 6వ తేదీ నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు. ఇక ఎస్సెస్సీ వార్షిక పరీక్షలను మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
మార్చి 6 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 7 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 10 – థర్డ్ లాంగ్వేజ్
మార్చి 11 – మ్యాథమేటిక్స్
మార్చి 12 – ఫిజికల్ సైన్స్
మార్చి 13 – బయోలాజిక్ సైన్స్
మార్చి 15 – సోషల్ స్టడీస్