హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవిష్య త్తు బీఆర్ఎస్ పార్టీదేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ కార్యకర్తల్లో భవిష్యత్తు ఆశలపై ఆనందం వెల్లివిరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మరో చారిత్రక మైలురాయిని చేరుకోబోతుందని తెలిపారు. 2001 ఏప్రిల్ 27న ఉద్యమనేతగా కేసీఆర్ స్థాపించిన గులాబీ పార్టీ.. ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన ధ్యేయంగా చేసుకుని ప్రజల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.