సామాజిక ఉద్యమంలా నియంత్రణ చర్యలు.. ద్విముఖ వ్యూహంతో సమూల నిర్మూలన
‘తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్’ మళ్లీ తెస్తాం.. డ్రగ్స్ నియంత్రణపై అధికారుల సదస్సులో సీఎం కేసీఆర్
అధునాతన ఆయుధాలతో మాఫియాపై పోరు వెయ్యి మంది సుశిక్షితులైన సిబ్బందితో పటిష్టంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంగంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ను అడ్డుకోవాలి అద్భుత పనితీరు కనబరిచే అధికారులకు అవార్డులు, రివార్డులు, అలకేషన్లు, ప్రమోషన్లుఏ గ్రామంలోనైనా ఒక్క రైతు గంజాయి సాగు చేసినట్టు తేలినా రైతుబంధు, సబ్సిడీలు కట్సమాజమనే వేరుకు పట్టిన చీడపురుగు డ్రగ్స్
ఇప్పటికే డ్రగ్స్కు బానిసలైనవారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని డీ అడిక్ట్ చేయడం కోసం తగిన కార్యాచరణ రూపొందించాలి.
డ్రగ్స్ వాడకానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించి, వారికి అందుతున్న డ్రగ్ నెట్వర్క్ లింక్ను నిర్మూలించాలి.
గంజాయి తదితర డ్రగ్స్ వ్యాపారం, పంపిణీ,వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలి. డ్రగ్స్ కంట్రోల్ విషయాల్లో తెలంగాణ పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలి. అభివృద్ధితో ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న తెలంగాణలో గంజాయి, కొకైన్, ఎల్సీడీ వంటి నారోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నది. మొగ్గలోనే దీనిని తుంచి వేయకపోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు తెలియకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుంది.
రాష్ట్రంలో నడుస్తున్న పబ్బులు, బార్లలో డ్రగ్స్ వినియోగంపై దృష్టి సాధించాలి. అలాంటి వాటిని గుర్తించి వెంటనే లైసెన్సులు రద్దు చేయాలి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పబ్స్ను గుర్తించాలి. పబ్స్ యజమానులందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి వారికి కచ్చితమైన ఆదేశాలివ్వాలి. నేనే తరచుగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తా. ఎటువంటి అలసత్వం లేకుండా అప్రమత్తతతో పనిచేయాలి.
సీఎం కేసీఆర్
డ్రగ్స్ వినియోగం వైపు ఎకువగా యువత ఆకర్షితులవుతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ధనవంతులు, పేదలు అనే భేదం లేకుండా అన్ని తరగతుల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారి పిల్లల అలవాట్లపై దృష్టి సారించాలి. డ్రగ్స్ వాడకం అత్యంత ప్రమాదకారి. దాన్ని కూకటివేళ్లతో నాశనం చేయకుంటే మనం సంపాదించే ఆస్తులకు, సంపాదనకు అభివృద్ధికి అర్థం లేకుండాపోతుంది. ఎంత ధనం ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం? మన పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్కు బానిసలై, వాళ్ల భవిష్యత్తు మన కండ్ల ముందే నాశనమై పోతుంటే ఎంత వేదన!
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తలెగరేస్తున్న డ్రగ్స్ మాఫియాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు యుద్ధం ప్రకటించారు. మాదక ద్రవ్యాల మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు అధికారులు విజృంభించాలని ఆదేశించారు. అవసరమైతే అధునాతన ఆయుధాలు ఉపయోగించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా విసృ్తతమవుతున్న గంజాయి, నారోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో ఆలోచనలు చేయాలని సీఎం చెప్పారు. ప్రతి ఒకరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలిచినప్పుడే డ్రగ్స్ నియంత్రణ సాధ్యమవుతుందని రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గంజాయి తదితర నారోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలనే లక్ష్యంతో శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నారోటిక్ డ్రగ్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడపురుగు వంటిదని తెలిపారు. ప్రజలను డ్రగ్స్కు వ్యతిరేకంగా చైతన్యపర్చేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకొని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ను ఏర్పాటుచేసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే అసాంఘిక వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకొన్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అలాగే నారోటిక్ డ్రగ్స్ను నియంత్రించే విభాగం కూడా శక్తిమంతంగా పనిచేయాలని సూచించారు. అద్భుత పనితీరు కనబరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు, ప్రమోషన్స్ తదితర ప్రోత్సాహకాలను అందించాలని కోరారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఏ పార్టీకి చెందినవారైనా నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు చేసే సిఫారసులను తిరసరించాలని స్పష్టంచేశారు.
గంజాయి, డ్రగ్స్ తదితర వ్యాపారం, పంపిణీ, వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత నేరగాళ్ల మూలాలను గుర్తించి పట్టుకోవాలని, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీసులు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలని సీఎం కేసీఆర్ సూచించారు. అభివృద్ధితో ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న తెలంగాణలో గంజాయి, కొకైన్, ఎల్సీడీ వంటి నారోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నదని, మొగ్గలోనే తుంచి వేయకపోతే డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరి, మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని హెచ్చరించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వైపు ఎకువగా యువత ఆకర్షితులవుతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని, ధనవంతులు, పేదలనే భేదం లేకుండా అన్ని తరగతుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ పిల్లల అలవాట్లపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ కోరారు. డ్రగ్స్ వాడకం అత్యంత ప్రమాదకరమని, దాన్ని కూకటివేళ్లతో సహా నాశనం చేయకుంటే మనం సంపాదించే ఆస్తులకు, సంపాదనకు, అభివృద్ధికి అర్థం లేకుండా పోతుందని చెప్పారు. ‘ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం? పిల్లలు డ్రగ్స్కు బానిసలై, వాళ్ల భవిష్యత్తు మన కండ్ల ముందే నాశనమై పోతుంటే ఎంత వేదన ఉంటుంది’ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను అనుక్షణం గమనిస్తూ ఉండాలని హెచ్చరించారు.
సినిమా, సోషల్ మీడియాతోపాటు సాంస్కృతిక వేదికలు, ఆన్లైన్ వేదికల మూలంగా డ్రగ్స్ వాడకం పెరిగిపోతున్నదని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘డ్రగ్స్ను నియంత్రించే దిశగా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రజా సంబంధాల వ్యవస్థలను మెరుగుపర్చాలి. మీడియా, సినిమా మాధ్యమాలను విసృ్తతంగా వినియోగించుకోవాలి. డ్రగ్స్ నియంత్రించే దిశగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, ప్రకటనలకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలి’ అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి నేరాలకు పాల్పడుతున్న వ్యవస్థీకృత నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారిని నియంత్రించేందుకు అన్ని చర్యలూ చేపట్టాలన్నారు. ఆయా దేశాల నుంచి వచ్చి ఇకడ నేరాలకు పాల్పడుతున్న విదేశీయులను గుర్తించి వెంటనే వారి దేశాలకు పంపించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చినట్టు తేలితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పబ్బులు, బార్లలో డ్రగ్స్ వినియోగంపై దృష్టి సారించాలని, అలాంటి వాటిని గుర్తించి, లైసెన్స్లు రద్దు చేయాలని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పబ్స్ను గుర్తించాలని, పబ్స్ యజమానులందరినీ పిలిపించి, సమావేశం ఏర్పాటు చేసి, కచ్చితమైన ఆదేశాలివ్వాలని డీజీపీని ఆదేశించారు. తరచుగా ఎక్సైజ్శాఖపై సమీక్ష నిర్వహిస్తానని, అలసత్వం లేకుండా అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బార్లలో, పబ్స్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు తెలిస్తే సంబంధిత ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. లంచాలు తీసుకొనే ఎక్సైజ్ సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ నుంచి డ్రగ్స్ కేసుల వివరాలను తెప్పించుకోవాలని, అడవుల్లో సాగవుతున్న గంజాయి వివరాలను గుర్తించాలని పేర్కొన్నారు. నారోటిక్ కేసుల విచారణలో ప్రభుత్వ అడ్వకేట్లు కొందరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, డ్రగ్స్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో నిబద్ధత కలిగినవారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. ఎఫ్ఎస్ఎల్, ప్రాసిక్యూషన్ విభాగాలను బలోపేతం చేయాలని చెప్పారు. పబ్బులు, బార్లలో పోలీసులు డీకామ్ ఆపరేషన్ చేపట్టాలని, డ్రగ్స్ను ప్రోత్సహిస్తున్న పబ్బుల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. గడుంబా, మద్యం తయారీని నిర్మూలించాలని.. గుడుంబా రహిత ప్రాంతాలుగా మార్చాలని సూచించారు. పేకాట తదితర వ్యవస్థీకృత నేరాలను సమూలంగా రూపుమాపాలని చెప్పారు. ఎక్సైజ్శాఖలో సీఐ స్థాయిలో అధికారులను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో వారికి డ్రగ్స్ నేరాలపై అవగాహన ఉంటుందని.. నిజాయతీగా పనిచేసేవారికి ప్రమోషన్స్ ఇవ్వాలని తెలిపారు. డీఈవోలు, అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ను పిలిచి సమావేశాలు నిర్వహించి కౌన్సెలింగ్ చేసి డ్రగ్స్ వినియోగం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
డ్రగ్ ఫ్రీ గ్రామాలకు ప్రత్యేక ఫండ్స్తో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామస్థులపైనే ఉన్నదని చెప్పారు. ఒక ఊరిలో ఐదుసార్లకు మించి గంజాయి దొరికితే, ఆ ఊరికి అన్నిరకాల సబ్సిడీలను రద్దుచేస్తామని స్పష్టంచేశారు. ఈ దిశగా గ్రామ సర్పంచ్, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా కూడా డ్రగ్స్ దందా నడుస్తున్నదనే విషయం పరిశీలనలో తేలిందని, దానిపైనా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలవ్యాప్తంగా ఎస్పీ, డీసీపీ, కమిషనర్లు తరచు ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ నేరస్థుల రికార్డు నిర్వహించి, పదేపదే నేరాలకు పాల్పడుతున్నవారిపై పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పారు. కేసుల విచారణలో భాగంగా నిందితులను తీసుకొని కోర్టులకు వెళ్లిన పోలీసులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని, వారికి ప్రత్యేక గదులను వసతులతో ఏర్పాటుచేయాలని సూచించారు. హైదరాబాద్ మహానగరం పరిధిలోని ముగ్గురు పోలీస్ కమిషనర్లు నగర గొప్పతనం పాడుకాకుండా చూసుకోవాలని చెప్పారు. వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాలు అభివృద్ధిపథాన పయనిస్తున్నాయని, వాటిని ఈ నేరాల బారిన పడకుండా చూసుకోవాలని హితవు చెప్పారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్లో నిప్పుకణికల్లాంటి అధికారులు ఉండాలని, గుడుంబా, అక్రమ మద్యం, లికర్, డ్రగ్స్పై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ‘తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్’ను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సదస్సులో మంత్రులు మహమూద్ అలీ, వీ శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు బాల సుమన్, రెడ్యానాయక్, రవీంద్రకుమార్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, గ్యాదరి కిశోర్, సాయన్న, రేఖానాయక్, అబ్రహాం, హన్మంతు షిండే, సుంకె రవిశంకర్, కృష్ణమోహన్రెడ్డితో పాటు మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్, సీఎంవో అధికారులు నర్సింగ్రావు, భూపాల్రెడ్డితో పాటు పోలీస్శాఖకు చెందిన రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలతో పాటు ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ వాడకం తెలంగాణలో ఇంకా ప్రమాద స్థాయికి చేరుకోలేదని, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న నారోటిక్ డ్రగ్స్ వాడకాన్ని మొగ్గలోనే తుంచేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. నేరస్థులను పట్టుకొని విచారించే క్రమంలో కీలకమైన ‘ఫోరెన్సిక్ ల్యాబ్స్’ మరిన్నింటిని అత్యంత అధునాతన సాంకేతికతో ఏర్పాటుచేయాలని ఆదేశించారు. న్యాయస్థానాల ఎదుట డ్రగ్స్ నేరస్థులను ప్రవేశపెట్టినప్పుడు కేసులు వీగిపోకుండా, అన్నిరకాల ఆధారాలతో నిరూపించాలని, ప్రాసిక్యూషన్ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో బెయిల్ త్వరగా వచ్చే పరిస్థితులున్నందున వ్యసనపరులు, వ్యాపారులు మళ్లీ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని అన్నారు. నేరాలను నిరూపించేందుకు చేపట్టాల్సిన చర్యలు, సమకూర్చాల్సిన వసతులను ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు.
డ్రగ్స్ నియంత్రణకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మొదటి వ్యూహంలో ఇప్పటికే డ్రగ్స్ బానిసైన వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో డీ అడిక్షన్ కోసం కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆ తర్వాత డ్రగ్స్ వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించి, వారికి అందుతున్న డ్రగ్ నెట్వర్క్ లింక్ను గుర్తించి, నిర్మూలించాలని చెప్పారు. డ్రగ్స్ మాఫియాను గుర్తించి, అరికట్టే క్రమంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలని, నిష్ణాతులైన చురకత్తుల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై విజృంభించాలని స్పష్టంచేశారు. సాట్లాండ్ యార్డ్ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి, డ్రగ్స్ నేరస్థులను పట్టుకొనే దిశగా పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. సాట్లాండ్ యార్డ్ మాదిరిగా డ్రగ్ కంట్రోల్ చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. పంజాబ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తున్న అధికారులను పిలిపించి శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదని, తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందని పునరుద్ఘాటించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణకు సమాజ సహకారం తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు. గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్స్, విద్యార్థులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. ఈ దిశగా స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చైతన్యపరచాలని కోరారు. గ్రామంలో ఏ రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా, ఆ సమాచారం అందించకపోతే ఆ గ్రామానికి రైతుబంధు, ఇతర సబ్సిడీలు రద్దు చేస్తామని స్పష్టంచేశారు. చట్ట వ్యతిరేక చర్యల పట్ల గ్రామస్థులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి సమాచారం అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇది అధికారుల ఆదేశాలతోనో, ఉద్యోగమనో కాకుండా బాధ్యతతో మాదక ద్రవ్యాల కట్టడికి కృషి చేయాలని కోరారు. అనుభవం ఉన్న ప్రతి అధికారిని ఈ అంశంలో వినియోగించుకోవాలని, వ్యవస్థీకృత నేరాలను నియంత్రిస్తున్నట్టుగానే పీడీయాక్ట్ కూడా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ‘మీరు ఏమి చేస్తారో ఏమో.. ప్రభుత్వం మీకు పూర్తి సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి అన్నిరకాల చర్యలు చేపట్టాలి’ అని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గంజాయి తదితర నారోటిక్ డ్రగ్స్ వినియోగం, వాటి మూలాలను గుర్తించి, కఠినంగా నియంత్రించాలని పోలీస్ కమిషనర్లకు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, సరిహద్దుల్లోంచి రవాణా అవుతున్న గంజాయి తదితర మాదక ద్రవ్యాల నెట్వర్ను గుర్తించి నిర్మూలించాలన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా నెట్వర్ను లోతుగా అధ్యయనం చేసి నియంత్రణకు కార్యాచరణ అమలుచేయాలని ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రించే విషయంలో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. అన్ని రకాల డ్రగ్ కంట్రోల్ విభాగాలను బలోపేతం చేయాలని, మూసివేసిన పరిశ్రమలు, ఫ్యాక్టరీలు డ్రగ్స్ తయారీ, పంపిణీ కేంద్రాలకు నెలవులుగా మారుతున్నాయని అధికారులు చెప్పడంతో, తక్షణమే అటువంటి ‘క్లోజ్డ్ ఇండస్ట్రీ’లను గుర్తించి రూపుమాపాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో హుకా సెంటర్లనే మాటే వినపడకూడదని చెప్పారు.
మనం పలు హోదాల్లో పనిచేస్తున్నం. ఉద్యోగులుగానే కాకుండా మానవులుగా మన మీద సామాజిక బాధ్యత ఉన్నది. మొత్తం సమాజాన్ని చెడగొట్టే, మన సంసృతిని, మన పునాదులను పెకిలించే పరిస్థితులు తలెత్తినపుడు కేవలం ఉద్యోగులుగా కాకుండా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అట్లా పనిచేయగలిగిన చోటనే సామాజిక పురోగతి సాధ్యమైతది. తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో రోల్మోడల్గా ఎదిగింది. ఈ ప్రగతిలో పాలుపంచుకుంటున్న అన్ని రంగాల ప్రభుత్వ ఉన్నతాధికారులను అభినందిస్తున్నా. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అన్ని శాఖల అధికారులను అభినందిస్తున్నా. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్రం అనేక బాధలు పెట్టింది. వాటన్నిటినీ అధిగమించి, అభివృద్ధి పథాన పయనిస్తున్నాం. పోలీస్ యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తున్నది. క్రైం డిటెక్షన్లో సీసీ కెమెరాలు గొప్పగా పనిచేస్తున్నాయి. నేరస్థులను వెంటనే పట్టుకోగలుగుతున్నాం.
లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ల విషయంలో కూడా పోలీసులు బాగా పనిచేస్తున్నారు. ఎస్ఐబీ, గ్రే హౌండ్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏర్పాటుచేశాం. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశంలో ఎకడా లేని విధంగా నిర్మించుకున్నాం. దాన్ని మార్చిలో ప్రారంభిస్తాం. ప్రజల సంతోషం కోసం, శాంతిభద్రతలు పరిరక్షించుకోవడం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోదు. అన్ని రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. స్టార్టప్స్, ఇన్నొవేటివ్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ శాంతి భద్రతల పరిరక్షణ సమర్థంగా ఉంటేనే వస్తాయి. ఒడిశా, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, గుజరాత్, కాయస్థ బ్రాహ్మణులు ఇట్లా అన్ని వర్గాలు హైదరాబాద్లో నివసిస్తున్నాయి. పేకాట, గుడుంబా తదితర వ్యవస్థీకృత నేరాలు తగ్గాయి. ఇదంతా మీరు చేసిన కృషి. డీజీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గొప్పగా శాంతిభద్రతలు ఉన్నాయి. పోలీస్శాఖ అమలుచేస్తున్న లా అండ్ ఆర్డర్తో మంచి ఫలితాలు వస్తున్నాయి. తాగునీరు, 24 గంటల విద్యుత్తు, పంటలు, ధాన్యం దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్నాం. ఇటువంటి ప్రగతి కొనసాగుతున్న సందర్భంలో.. తెలంగాణను మరింత గొప్పగా నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.