హైదరాబాద్ : గోదావరి నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. పోలవరంపై ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం తెలుపుతూ జీఆర్ఎంబీ చైర్మన్కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం డెడ్స్టోరోజ్ నుంచి నీటి ఎత్తిపోతల సబబుకాదని తెలిపారు. గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటూ అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తున్న విషయాన్ని గుర్తు చేసిన ఈఎన్సీ, మరి ఏపీ కొత్త ప్రాజెక్టులేంటని ప్రశ్నించారు. దీనిపై గోదావరి నదీయాజమాన్య బోర్డు చేసుకోవాలని కోరారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ కోరారు.