Telangana | హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Governor Tamilisai )కు ఉగాది( Ugadi ) శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి( Sabitha Indra Reddy ), సత్యవతి రాథోడ్( Satyavathi Rathod ) లేఖ రాశారు. గవర్నర్కు తమిళిసైకి తెలంగాణ యువత( Telangana Youth ) పట్ల ప్రేమ ఉంటే తొక్కి పెట్టిన కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలని కోరారు. తెలంగాణ యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు కేంద్ర ప్రభుత్వం( BJP Govt ), హైదరాబాద్లోని రాజ్భవనే( Raj Bhavan ) కారణమని గవర్నర్ తెలుసుకోవాలని ఆమెకు మంత్రులు సూచించారు. ఈ ఉగాది పండుగ సందర్భంగా యువత ఎదుర్కొంటున్న చేదును దాటి, తీపి రోజులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వ వివక్షపైన గవర్నర్ స్పందించాలన్నారు.
తెలంగాణ యువత ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలపైన వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపైన గవర్నర్ గళమెత్తాలి అని మంత్రులు సూచించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలతో తమకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అమలయ్యేలా సీఎం కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను( Govt Jobs ) భర్తీ చేసుకుంటున్నాం. 22 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా పారిశ్రామిక విధానాన్ని తీర్చిదిద్ది పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చుకున్నాం. ఐటీ రంగం( IT Sector )లో దేశానికే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం అని మహిళా మంత్రులు పేర్కొన్నారు.
కేంద్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బకొడుతూ విద్యాసంస్థల్లోనూ అన్యాయం చేస్తుందని మంత్రులు మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల, ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. ఉపాధి అవకాశాలను కల్పించే విభజన చట్టం హామీలను కేంద్రం పక్కన పెట్టింది. తెలంగాణ యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు మీరు కూడా ప్రత్యక్ష కారణం. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును తొక్కిపెట్టిన విషయం మరిచిపోయినట్లు ఉన్నారు. ఛాలెంజ్లను స్వీకరించేందుకు రాజ్భవన్ సిద్ధంగా ఉంటే కేంద్రం వైఖరిపై మాతో కలిసిరండి. యువతకు రాజ్భవన్ అండగా ఉంటుందన్న భరోసా నిజమే అయితే కేంద్రం అన్యాయలను కూడా అడ్డుకోండి. ఈ ప్రక్రియలో మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ.. గవర్నర్కు మహిళా మంత్రులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.