కొండాపూర్, ఫిబ్రవరి 17: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యానిమల్ బయోలజీ విభాగంలో డీఎస్టీ సైంటిస్ట్ డాక్టర్ మమతా సజ్వాన్ ఖత్రీ ప్రతిష్ఠాత్మక జీపీ తల్వార్ యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇండియన్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ రీప్రొడక్షన్ అండ్ ఫెర్టిలిటీ (ఐఎస్ఎస్ఆర్ఎఫ్) ఏటా పరిశోధనల్లో ఉత్తమ ప్రతిభకనబరుస్తున్న యువ సైంటిస్టులను గుర్తించి ఈ అవార్డును అందజేస్తున్నది. సజ్వాన్ రీప్రొడక్టివ్ హెల్త్ విభాగంలో అందిస్తున్న ఉత్తమ సేవలను పరిగణనలోకి తీసుకొని 2022 సంవత్సరం అవార్డుకు ఎంపిక చేసినట్టు వర్సిటీ తెలిపింది.