2024 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థులను 150 నియోజకవర్గాల్లో పోటీకి దింపాలని ప్రాథమికంగా నిర్ణయిం చాం. కానీ అప్పటి పరిస్థితులను బట్టి మార్పు ఉండొచ్చు. దళితులపై దౌర్జన్యాలను అరికట్టేందుకు, రైతులను ఆర్థిక నష్టాల నుంచి తప్పించేందుకు జేడీఎస్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలు కలిసి పనిచేస్తాయి. – కుమార స్వామి
బెంగళూరు, నమస్తే తెలంగాణ ప్రతినిధి: కర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గెలిస్తే తెలంగాణ తరహాలో రైతుబంధు, రైతుబీమాను అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. హైదరాబాద్లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో పాల్గొన్న ఆయన గురువారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే వ్యవసాయానికి 24 గంట ల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున బీమా పరిహారం, దళితుల స్వయం ఉపాధి కోసం రూ.పది లక్షల నగదు సాయం అందజేస్తామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వీటిని పొందుపరుస్తామని స్పష్టంచేశారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల నుంచి ఎంపికచేసిన రైతులు, దళితులు, వారి సంఘాలను తెలంగాణకు పంపి అధ్యయనం చేయించాలని కేసీఆర్ సలహా ఇచ్చారని, త్వరలోనే పంపుతామని పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతంలో 15-20 శాసనసభ స్థానాల్లో కేసీఆర్ ప్రభావం ఉన్నదని చెప్పారు. గత ఎన్నికల్లో ఆ ప్రాంతం నుంచి నాలుగు స్థానాల్లో గెలిచామని, వచ్చే ఎన్నికల్లో 15-20 స్థానాల్లో గెలవగలమని ధీమా వ్యక్తం చేశారు. అకడ తమ పార్టీకి పట్టుందని, 2024 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థులను 150 నియోజకవర్గాల్లో పోటీకి దింపాలని ప్రాథమికంగా నిర్ణయించామని, అప్పటి పరిస్థితులను బట్టి మార్పు ఉండొచ్చని చెప్పారు. దళితులపై దౌర్జన్యాలను అరికట్టేందుకు, రైతులను ఆర్థిక నష్టాల నుంచి తప్పించేందుకు జేడీఎస్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు.