వరంగల్ : తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు . వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ నుంచి ఇనుగుర్తి వరకు12 కోట్లతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు, 20 లక్షలతో చేపట్టిన రెడ్లవాడ గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ. 1. 70 లక్షలతో చేపట్టిన రెడ్ల వాడ గ్రామ అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి మంత్రి మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గ్రామాల్లో మంచినీరు, విద్యుత్, రోడ్లు తదితర సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పర్వతగిరి శివాలయంలో కొనసాగుతున్న పున:ప్రతిష్ట పూజలు
వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఎనిమిదివందల నాటి ఏళ్లనాటి పర్వతాల శివాలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు మహాలింగార్చన, పంచామృత అభిషేకాల్లో పాల్గొని శివార్చన చేశారు.